Manmadhudu 2 movie, akkineni nagarjuna, rakul |
మన్మధుడు అనగానే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగార్జున. నాగార్జున నటించిన "మన్మధుడు" సినిమా 2002 డిసెంబర్ 20న విడుదలైంది. ఈ సినిమాలో సోనాలి బింద్రే , అన్షు కథానాయికలుగా నటించారు. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్ళని కూడా రాబట్టింది ఈసినిమా. అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో ఈ సినిమా ప్రత్యేకమైనది. అందుకేనెమో నాగార్జున స్వయంగా మన్మధుడు 2 సినిమాని నిర్మిస్తున్నారు.
మన్మధుడు 2 ప్రేమ కథకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున తో జతకట్టింది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో సమంత అక్కినేని, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిధి పాత్రలలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ , నాసర్, లక్ష్మి, దేవదర్శిని , ఝాన్సీ, రావు రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మన్మధుడు 2 సినిమా ఆగష్టు 9 ,2019 విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అంటున్నారు. అక్కినేని అభిమానులు .